తెలంగాణలో మళ్లీ 2వేల కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. పెరుగుతున్నాయ్. గడిచిన 24 గంటల్లో 1,949 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,99,276 కేసులు నమోదు అయ్యాయి. నిన్న కరోనాతో 10 మంది మరణించారు. ఇప్పటి వరకు 1163 మంది కరోనాతో మరణించారు.

నిన్న ఒక్క రోజే 2,366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  1,70,212 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణాలో రికవరీ రేటు 85.41% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 83.1% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి.