సుశాంత్’ది హత్యే.. రేపు సాక్ష్యాలు బయటపెట్టబోతున్న ఆర్నాబ్ !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ది ఆత్మహత్యా ? హత్యా ?? తేల్చే పనిలో సీబీఐ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో సుశాంత్ ది హత్యే అనడానికి సాక్ష్యాలు లభించలేదని సమాచారమ్. ఎయిమ్స్ నివేదిక కూడా సుశాంత్ ది ఆత్మహత్యేనని స్పష్టం చేసింది. అయితే రిపబ్లిక్ టీవి ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి మాత్రం సుశాంత్ ది హత్యే.. దానికి సంబంధించిన సాక్ష్యాలని సోమవారం ఉదయం 10 గంటలకు భయటపెడుతానని సంచలన ప్రకటన చేశారు.

సుశాంత్ మర్డర్ వెనకున్న కీలక టేపులతో పాటు పలు కాల్ రికార్డ్‌లని కూడా అర్నబ్ సోమవారం బయటపెట్టబోతున్నాడట. ఫోరెన్సిక్ ఛీఫ్ సుధీర్ గుప్తా రిపోర్ట్‌ని ఉటంకిస్తూ సంచలన ప్రకటన చేయబోతున్నాను. సుశాంత్ ది ఓ సాధారణ ఆత్మ హత్య ఏయిమ్స్ డాక్టర్ల బృందం తేల్చింది. అయితే ఏయిమ్స్ ఇలా ఎందుకు చెప్పిందని, నిజాలని ఎందుకు దాస్తోందని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటి దారని సుశాంత్ అభిమానులు అంటున్నారు. వారందరి తరుపున సోమవారం నేను నిలబడబోతున్నాను. సుశాంత్‌ది ఆత్మ హత్యే అయితే ఏయిమ్స్ ఛీఫ్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆయన అబద్ధపు నివేదికని ఇవ్వమని ఆయనని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా? చేశారా? అన్నది రేపు తేలబోతోందన్నారు ఆర్నాబ్.