ఐపీఎల్ : హైదరాబాద్’పై ముంబై గెలుపు


ఆరేంజ్ ఆర్మీకి మరో పరాభవం. షార్జా వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (67; 39 బంతుల్లో, 4×4, 4×6) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఆయనకి తోడుగా సూర్యకుమార్ యాదవ్‌ (27; 18 బంతుల్లో, 6×4), ఇషాన్‌ కిషన్ (31; 23 బంతుల్లో, 1×4, 2×6) రాణించారు.

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ (60 ప‌రుగులు, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), మ‌నీష్ పాండే (30 ప‌రుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, జేమ్స్ ప్యాటిన్స‌న్‌, బుమ్రాల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి. కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశాడు.