ఎమ్మెల్సీ ‘బరిలో కోదండరాం’ – తెజస ప్రకటన

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్‌ కోదండరాం పోటీపై తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) క్లారిటీ ఇచ్చింది. నల్లగొండ – వరంగల్ -ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్‌ కోదండరాం పోటీ చేస్తున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు కోదండరామ్ కు కాంగ్రెస్ మద్దతుపై క్లారిటీ రావాల్సి ఉంది.

మొదటి నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కోదండరామ్ నిలబడతారనే ప్రచారం ఉంది. ఇందుకు తెలంగాణ తెదేపా ఓకే చెప్పినట్టు తెలిసింది. దీనిపై కాంగ్రెస్ కూడా చర్చిస్తోంది. త్వరలోనే నిర్ణయాన్ని చెప్పనుంది. “వరంగల్‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుంది” అని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్  తెలిపారు.