వైరల్ : ఆ ఇద్దరికి ధోని సలహాలు

ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నైలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ క్రీడాస్ఫూర్తిని చాటాడు. ప్రత్యర్థి జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఆటను ఎలా చూడాలి? ఏ సమయంలో ఎలా ఆడాలి? ఎలాంటి షాట్లు బాదాలి? మ్యాచ్‌ను ఎలా అధ్యయనం చేయాలి? వంటి అంశాలను వారికి వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇన్న నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ మొదట 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (63), మయాంక్‌ అగర్వాల్‌ (26), మన్‌దీప్‌ (27), పూరన్‌ (33) ఫర్వాలేదనిపించారు. అయితే ఛేదనలో పంజాబ్‌ బౌలింగ్‌ను ధోనీసేన తుత్తునియలు చేసింది. వికెట్లేమీ నష్టపోకుండా 17.4 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (83*; 53 బంతుల్లో 11×4, 3×6), డుప్లెసిస్‌ (87*; 53 బంతుల్లో 11×4, 1×6) పరుగులతో రాణించారు.