బెంగళూరుతో మ్యాచ్.. ఢిల్లీ భారీ స్కోర్ ! 

ఐపీఎల్ లో ఈరోజు మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మార్కస్‌ స్టాయినిస్‌ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6),  పృథ్వీ షా (42; 23 బంతుల్లో, 5×4, 2×6),  శిఖర్‌ ధావన్‌ (32; 28 బంతుల్లో, 3×4), పంత్ (37; 25 బంతుల్లో, 3×4, 2×6) రాణించారు. 

ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 4.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులతో ఆటనికొనసాగిస్తొంది. ప్రస్తుతం క్రీజు కోహ్లీ 10, డివిలియర్స్ 0 పరుగులతో ఆటని కొనసాగిస్తున్నారు. మైదానం పెద్దది కావడంతో 197 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.