పదేళ్లయినా.. ఆ ‘ఖలేజా’ తగ్గలే !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘ఖలేజీ’. మహేశ్‌లోని హీరోయిజంతోపాటు కామెడీ టైమింగ్‌ను ప్రేక్షకులకు చేరువ చేసిన ఈ సినిమా విడుదలై బుధవారంతో 10 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌ సోషల్‌మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు.

‘ఖలేజా’ చిత్రం విడుదలై పదేళ్లు అవుతోంది. ఒక నటుడిగా నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకున్న చిత్రం. నా కెరీర్‌లో ఎప్పటికీ ఇది ప్రత్యేకమైన సినిమా. నాకు మంచి స్నేహితుడైన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. మన తదుపరి చిత్రం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్విట్ చేశారు.