TSలో 1,891 కేసులు, 7 మరణాలు 

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,891 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,208కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,878 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,80,953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,374 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,801మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.