ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా బిగ్ సప్రైజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం రానున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె నటించనున్నారు.

తాజాతా ఈ సినిమా నుంచి బిగ్ సప్రైజ్ వచ్చేసింది. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రబృందం ఓ వీడియోని రిలీజ్ చేసింది. దీపికా పదుకొనె పేరుని అధికారికంగా ప్రకటించినట్టుగానే బిగ్ బీ వీడియోని డిజైన్ చేశారు.

ఈ విషయాన్ని బిగ్ బీ కూడా ధృవీకరించారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తకాగానే నాగ్ అశ్విన్ సినిమాలో నటించనున్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.