దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 70,496 కొత్త కేసులు నమోదయ్యాయ్.
దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,06,151కి చేరింది.

నిన్న ఒక్కరోజే 964 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,06,490కి పెరిగింది. ప్రస్తుతం 8,93,592 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 59,06,069 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 85.52 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.54 శాతంగా ఉంది.