ఐపీఎల్ : పంజాబ్ పై హైదరాబాద్ భారీ విజయం

ఐపీఎల్ 13లో సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి సామర్థ్యంతో ఆడింది. గురువారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ని చిత్తు చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌(52; 40 బంతుల్లో 5×4, 1×6), బెయిర్‌స్టో(97; 55 బంతుల్లో 7×4, 6×1) చెలరేగిపోయారు.

202 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 16.5 ఓవర్లకు 132కే కుప్పకూలింది. నికోలస్‌ పూరన్‌ (77; 32 బంతుల్లో 5×4, 7×6) భీకరమైన సిక్సర్లతో భయపెట్టినా మిగిలిన వికెట్లను పడగొట్టి వార్నర్‌ సేన విజయ బావుటా ఎగరేసింది.మాక్స్‌వెల్‌ (7), మన్‌దీప్‌ సింగ్‌ (6), ముజీబుర్‌ రెహ్మాన్‌ (1) తీవ్రంగా నిరశాపరిచారు. ఖలీల్‌ అహ్మద్‌ (2/24), రషీద్‌ ఖాన్‌ (3/12), నటరాజన్‌ (2/24) ఆకట్టుకున్నారు.