తీపి కబురు చెప్పిన అనిత 

నటి అనిత తీపి కబురు చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. 2013లో అనిత పారిశ్రామికవేత్త రోహిత్ ని పెళ్లాడింది. గతంలో చాలా సార్లు అనిత ప్రెగ్నెంట్ అనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆ ప్రచారాన్ని అనిత కొట్టిపారేశారు. తాజాగా ఆమె అభిమానులతో తల్లికోబోతునన్ శుభవార్తని పంచుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోని షేర్ చేశారు.

రోహిత్‌-అనిత పరిచయం.. ప్రపోజ్‌ చేసుకోవడం.. పెళ్లి.. ఇలా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో ఆకట్టుకునే విధంగా చూపించారు. సదరు వీడియో చూసిన నెటిజన్లు.. అనిత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్యరాయ్‌, అనిల్‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తాళ్‌’ చిత్రంతో అనిత వెండితెరకు పరిచయమయ్యారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో ఆమె మెరిశారు.