ఏపీ కరోనా రిపోర్ట్ : 5,210 కేసులు, 30 మరణాలు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 5,210 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 5,509 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 46,295 యాక్టివ్‌ కేసులున్నాయి.  

24 గంటల వ్యవధిలో 30 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరణించారు. ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు 4, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున మృతిచెందగా.. అనంతపురం, కృష్ణాలో ఇద్దరేసి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,224కి చేరింది.