SRHVsRR : కష్టాల్లో రాజస్థాన్ 47/3 (7) ఓవర్లు

ఐపీఎల్ లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ పట్టుబిగుస్తోంది. మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మనీష్‌ పాండే(54; 44 బంతుల్లో 2×4, 3×6), డేవిడ్‌ వార్నర్‌(48; 38 బంతుల్లో 3×4, 2×6), విలియమ్సన్‌(22; 12 బంతుల్లో 2×6), ప్రియమ్‌గార్గ్‌(15; 8 బంతుల్లో 1×4, 1×6) రె రాణించారు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ పడింది. ఓపెనర్ గా వచ్చిన బెన్ స్టోక్ 5 పరుగులకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ బట్లర్ 16 పరుగుల వద్ద అవుటయ్యాడు. స్మిత్ 5 పరుగుల వద్ద రన్ అవుటయ్యారు. ప్రసుత్తం 7 ఓవర్లలో రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులతో ఆటని కొనసాగితోంది. క్రీజులో సంజూ శాంసన్ 12, ఉతప్ప 14 పరుగులతో ఉన్నారు.