పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. బ్రెయిన్ స్టోక్ రావడంతో కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని స్వ గ్రామానికి తరలిస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయని తెలిసింది.

సత్యనారాయణమ్మ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సత్యనారాయణమ్మ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలు, పిల్లి కుటుంబం అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇక ఎమ్మెల్సీ కోటాలో ఏపీ మంత్రిగా ఉన్న పిల్లి… రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేసిన గెలుపొందిన నేపథ్యంలో.. మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.