బిగ్ బ్రేకింగ్ : ఎమ్మెల్సీగా కవిత ఘన విజయం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్, బిజెపిలకు కనీసం డిపాజిట్ కూడా రాలేదు. మరికాసేపట్లో కవితకు గెలుపు ధృవీకరణ పత్రం అందించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

మొత్తం ఓటర్లు 824 మంది ఉండగా.. ఒకరు మృతి చెందడంతో మిగతా 823 మంది ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. తెరాస నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, భాజపా నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. అయితే భాజాపా, కాంగ్రెస్ లా గూబ గుయ్యిమనేలా కవిత ఘన విజయం సాధించడం విశేషం.