ఏపీలో కొత్త సర్వే.. జగన్’కు షాక్ ఇచ్చిన ప్రజలు !

‘బాబు రావాలి.. జాబు రావాలి’, ‘బాబు ఈజ్ బ్యాక్’ నినాదాలతో 2014 ఏపీ అసెంబ్లీలో తెదేపా గెలుపొందింది.  ఇక ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ వైకాపా స్లోగన్ కి ఏపీ ప్రజలు ఫిదా అయిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించారు. యేడాదిన్నర పాలనని పూర్తి చేసుకున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో సంచలన తీర్పునిచ్చారు ఏపీ ప్రజలు.

మరోసారి జగన్ నే రావాలని కోరుకుంటున్నారు. గత ఏడాది ఫలితాల్లో వైకాపాకు 50 శాతం ఓట్లు వస్తే ఇపుడు సర్వేలో 53 శాతం ఓట్లు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఇది ప్రజలు ఇచ్చిన బహుమతిగా చెబుతున్నారు విశ్లేషకులు. సీఎం జగన్ దూకుడు ప్రజలకి నచ్చింది.

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలోనూ జగన్ కొత్త సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు. కేంద్రానికి. ప్రతిపక్షాలకి జక్కడం లేదు. ఏకంగా న్యాయ వ్యవస్థపైనే సీఎం జగన్ గురిపెట్టిన సంగతి తెలిసిందే. బహుశా.. ఆ దూకుడు నచ్చే ఏపీ ప్రజలు మరోసారి సీఎం జగన్ నే రావాలి కోరుకుంటునట్టున్నారు. ఈ సర్వే ఫలితాలు ప్రతిపక్షాలకి మాత్రమే కాదు.. సీఎం జగన్ కూడా షాక్ కు, సప్రైజ్ కి గురి చేస్తాయని చెప్పవచ్చు.