మరోసారి తెవాతియా షో.. రాజస్థాన్ గెలుపు !

సంచలన విజయాలకి రాజస్థాన్ రాయల్స్ మారు పేరుగా మారింది. తెవాతియా షోతో పంజాబ్ పై రాజస్థాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిన్న హైదరాబద్ జరిగిన మ్యాచ్ లోనూ ఇలాంటి విజయాన్నే దక్కించుకుంది రాజస్థాన్.

హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఆ జట్టును రాహుల్‌ తెవాతియా(45; 28 బంతుల్లో 4×4, 2×6), రియాన్‌ పరాగ్‌(42; 26 బంతుల్లో 2×4, 2×6) ఆదుకున్నారు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో ఉండి విజయాన్ని అందించారు.