వెంకీ, చిరు నో చెప్పేశారు

కరోనా లాక్‌డౌన్ తో ఆర్నెళ్ల పాటు షూటింగ్స్ బంద్ అయ్యాయ్. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ సందడి తిరిగి మొదలవుతోంది. స్టార్ హీరోలు సెట్స్ మీదకు వెళ్తున్నారు. ఐతే సీనియర్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒక్క నాగార్జున తప్ప.. మిగితా వారు షూటింగ్స్ కి నో చెబుతున్నారు. ఈ యేడాది షూటింగ్స్ చేసేది లేదని ఇప్పటికే విక్టరీ వెంకటేష్ చెప్పేశారు. మెగాస్టార్ చిరంజీవిది అదే మాట. బాలయ్య సెట్స్ మీదకు రావాలంటే మంచి ముహూర్తం కుదరాలి. అది రావాలంటే.. ఈ యేడాది పోవాలి.

ప్రస్తుతం వెంకీ నారప్ప సినిమా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయింది. మరో నెలరోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. వచ్చే యేడాది జనవరి మొదటి వారంలో మొదలెట్టిన చకాచకా పూర్తి చేసి… సంక్రాంతి రేసులో నిలవొచ్చు అన్నది వెంకీ ప్లాన్ లా ఉంది. ఆచార్య పరిస్థితి మాత్రం డిఫెరెంట్. కేవలం 30శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. మెగాస్టార్ చేయాల్సిన లెంగ్తీ షెడ్యూలు అలాగే వుంది. చరణ్ చేయాల్సిన 30 రోజుల వర్క్ అలాగే వుంది. ఈ సినిమాను ఏప్రియల్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే చిరు ఈ యేడాది షూటింగ్స్ కి రాకున్నా.. ఇతర పార్ట్ ని పూర్తి చేసే పనిలో కొరటాల ఉన్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో రామ్ చరణ్ పాత్రని పూర్తి చేసి.. జనవరి నుంచి మెగాస్టార్ షూటింగ్ లో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్.