కోలీవుడ్ మహేష్’తో మొదలు

కరోనా లాక్‌డౌన్ తో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అన్ లాక్ 5లో భాగంగా నేటి నుంచి థియేటర్స్ ఓపెనింగ్ కి కేంద్రం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయినా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకునే పరిస్థితులు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు పక్క రాష్ట్రాల్లో సందడి చేయబోతున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ప్రేక్షకుల్ని అలరించిన పలు సూపర్‌హిట్‌ చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు. 

థియేటర్లు ఓపెన్‌ కాగానే.. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘సరిలేరు నీకెవ్వరు'(తమిళ్‌డబ్బింగ్‌) చిత్రాన్ని చెన్నైలో మొదటి సినిమాగా ప్రదర్శించనున్నారు. మరోవైపు నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘భీష్మ’, అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమాలను సైతం బెంగళూరులోని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. కొత్త సినిమాలు రిలీజ్ చేసి రిక్స్ తీసుకోవడం కంటే.. ఈ యేడాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలని మరోసారి రిలీజ్ చేయడమే బెటర్ ఏమో.. !