కరోనాతో బీహార్ మంత్రి మృతి

దేశంలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. వీరిలో కొందరు కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా జనతాదళ్‌ (యునైటెడ్‌) సీనియర్‌ నేత, బిహార్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ డియో కామత్‌ (69) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్‌ సోకడంతో గత కొద్దిరోజులుగా ఆయన పట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

మంత్రి మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆయన మృతి ఎంతో బాధాకరం. రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిది’ అంటూ నితీశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగంతి తెలిసిందే. అంతా మూడులోనే ఉండగా.. మంత్రి కపిల్‌ డియో కామత్‌ మృతితో విషాదం నెలకొంది.