బాలీవుడ్ సింగర్ కుమార్ సనుకి కరోనా

కరోనా బారినపడుతున్న సెలబ్రిటీల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ కుమార్ సనుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు.”దురదృష్టవశాత్తు సనుడా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ మై టీమ్‌” అంటూ ట్విట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కుమార్ సను త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

కుమార్‌ సాను 1990లో బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలకు తన గానాన్ని అందించారు . బీబీసీ టాప్‌ 40 బాలీవుడ్‌ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్‌ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో 21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 2009లో పద్మ శ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. సనూకు భార్య సలోని, కూతుళ్లు షానూన్‌, అన్నాబెల్‌ ఉన్నారు.

ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్, బోనీ కపూర్, అమీర్ ఖాన్ … కుటుంబాలు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బిగ్ బీ అమితాబ్ షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు.