త్వరపడండీ.. ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ !

దివాళీ విత్ ఎంఐ సేల్ ప్రకటించింది షావోమీ. టాప్ దివాళీ డీల్స్, దివాళీ బెస్ట్ సెల్లర్స్ పేరుతో అనేక డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.  ఈ సేల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫ్లాష్ సేల్ గురించి. ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు జరిగే సేల్‌లో ప్రతీ రోజూ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. రోజూ రెండు ప్రొడక్ట్స్ చొప్పున ఆరు రోజుల్లో 12 ప్రొడక్ట్స్‌ని ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది.

ఈ ఫ్లాష్ సేల్ లో కేవలం రూ.1కే రెడ్‌మీ నోట్ 9 ప్రో, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్‌ని అమ్ముతోంది. కానీ అవి లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి.అక్టోబర్ 16న సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన రెడ్‌మీ నోట్ 9 ప్రో ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 10 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.

ఇక అక్టోబర్ 16న సాయంత్రం 4 గంటలకు రూ.500 విలువైన ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 ప్రొడక్ట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి. అక్టోబర్ 17న సాయంత్రం 4 గంటలకు రూ.1,899 విలువైన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ప్రొడక్ట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 25 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి. ఇలా చాలానే ఉన్నాయ్. మరీ వాటిని సొంతం చేసుకోవడానికి రెడీగా ఉండండి.