కెప్టెన్ మారిన కోల్‌కతా తీరు మారలేదు.. ముంబై చేతిలో ఓటమి !


ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. నేటి మ్యాచ్ లో కోల్‌కతాపై ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. 

కమిన్స్‌ 53 (36 బంతుల్లో), మోర్గాన్ (39*; 29 బంతుల్లో, 2×4, 2×6) రాణించారు. గిల్‌ (21, 23 బంతుల్లో; 2×4), దినేశ్‌ కార్తీక్‌ (4; 8 బంతుల్లో; 1×4), రసెల్‌ (12; 9 బంతుల్లో, 1×4, 1×6) తీవ్రంగా నిరాశపరిచారు. ముంబయి బౌలరల్లో రాహుల్ చాహర్ రెండు వికెట్లు, బౌల్ట్, కౌటర్‌నైల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.

149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 15.5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. డికాక్ 78 (44 బంతుల్లో), రోహిత్ శర్మ  35(36 బంతుల్లో), హార్ధిక్ పాండ్యా 21 (11 బంతుల్లో) రాణించారు.