నాయిని ఆరోగ్యం అత్యంత విషమం ?

ఉద్యమ నేత, తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారమ్. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది.

ఇటీవలే నాయిని కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దాని నుంచి కోలుకున్నారు. అయితే కరోనా సోకడం కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. దానికితోడు ఊరిపితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం అపోలో డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాయిని కాపాడటానికి అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్.