నాయిని ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా ?

తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలొచ్చాయ్. దీంతో.. ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా మంత్రి ఈటెల నాయినిని పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ని చూస్తే.. నాయిని ఆరోగ్యం సీరియస్ గానే ఉన్నట్టు అనిపిస్తొంది. ఆయన మాట్లాడలేని పరిస్థితిల్లో ఉన్నారు తెలుస్తోంది. ఇటీవలే నాయిని కరోనా బారిపడిన సంగతి తెలిసిందే. దాని నుంచి కోలుకొన్న తర్వాత ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ రావడంతో.. మరోసారి హాస్పటల్ లో చేరారు. నాయిని క్షేమంగా తిరిగి రావాలని ఆయన అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.