ఏబీ.. హిట్ బెంగళూరు సూపర్ హిట్ !

ఐపీఎల్ లో కోహ్లీ సేన ఖాతాలో మరో విజయం పడింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు థ్రిల్లర్ విక్టరీ నమోదు చేసింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప(41; 22 బంతుల్లో 7×4, 1×6), బెన్‌స్టోక్స్‌(15; 19 బంతుల్లో 2×4) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. జోస్‌బట్లర్‌(24; 25 బంతుల్లో 1×4, 1×6), స్టీవ్‌స్మిత్‌(57; 36 బంతుల్లో 6×4, 1×6) రాణించారు.

178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌(55; 22 బంతుల్లో, 1×4, 6×6) విధ్వంసకరంగా బ్యాటింగ్‌ చేయడంతో ఉత్కంఠభరిత పరిస్థితిల్లో గెలుపొందింది. కోహ్లీ(43; 32 బంతుల్లో 1×4, 2×6), దేవ్‌దత్‌ పడిక్కల్‌(35; 37 బంతుల్లో 2×4) రాణించారు.