వచ్చే యేడాది ‘జనగనమన’ పాడతారా ?

మహేష్ బాబు-పూరి జగన్నాథ్’లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు పోకిరి, బిజినెస్ మేన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యారు. పోకిరి అయితే ట్రెండ్ సెట్ చేసింది. మహేష్ ని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే మహేష్ తో హ్యాట్రిక్ సినిమా చేయాలని పూరి ప్రయత్నించారు. తన కలల సినిమా అంటూ ‘జనగనమన’ కథని మహేష్ కి చెప్పాడు. ఆయన కూడా ఓకే చేశాడు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ తర్వాత అప్ డేటు లేదు. దీనిపై ఓ ఇంటర్వూలో పూరి మాట్లాడుతూ.. మహేష్ ప్లాపుల్లో ఉంటే సినిమా చేయడు. ఆయన మరో సినిమా చేసేది లేదని తెగేసి చెప్పాడు.

అయితే ఇటీవల పరిస్థితి మారింది. పూరితో సినిమా చేసేందుకు మహేశ్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసిందే. జనగనమన కథ అయినా ఓకే అని మహేష్ రాయబారం పంపినట్టు తెలుస్తోంది. దీంతో పూరి-మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా ఖాయం. అది 2021 లేదంటే 2022లోనైనా ఉండొచ్చని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పూరి ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ కథానాయకుడు యశ్ తో పూరి సినిమా ఉండనుంది. ఇదీ కూడా పాన్ ఇండియా సినిమా అని చెబుతున్నారు. మరోవైపు మహేష్ సర్కారు వారి పాట సినిమా చేయబోతునారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.