దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే అనిపిస్తుంది. ఇటీవల రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 60వేల పై చిలుకుగా నమోదవుతూ వస్తున్నాయ్. అయితే గడిచిన 24 గంటల్లో దేశంలో 55,722 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,50,273కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 579 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,610గా నిలిచింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 66,63,608 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,72,055 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 88.26 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం నమోదైన కేసుల్లో కేవలం 10.23 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది.