తెలంగాణలో 1,486 కొత్త కేసులు, 1,891 రికవరీ

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టేనట్టే అనిపిస్తోంది. ఇటీవల నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటలో  తెలంగాణలో 1486 కొత్త కేసులు నమోదయ్యాయ్. 1891 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,282కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,891 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,02,577కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.