మహేష్ మాస్టర్ ప్లాన్.. ఆ రెండు సినిమాలు ఒకేసారి !

ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్ కొట్టారు మహేష్. ఆయన తదుపరి సినిమా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ తెరకెక్కాల్సి ఉంది. ఇంతలో త్రివిక్రమ్ సినిమా తెరపైకి వచ్చింది. దీంతో పరశురామ్ ని పక్కనపెట్టేసి తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. మహేష్ త్రివిక్రమ్ సినిమా చేయనున్నది నిజమే. కానీ పరశురామ్ సినిమాని వదులుకోవడం లేదట. ఈ రెండు సినిమాలని ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేశారట.

పరశురామ్, త్రివిక్రమ్ దర్శకత్వాల్లో రెండు సినిమాలను ఒకేసారి మహేష్ బాబు చేయనున్నారని తెలుస్తోంది. 2021లో ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఒకేసారి పూర్తిచేయనున్నారట. వాస్తవానికి త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్ టీఆర్ తో ఉండాల్సి ఉంది. కానీ తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రావాలి. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మహేష్ తో సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.