దివ్య హత్యకేసులో మరో ట్విస్ట్

దివ్య తేజశ్విని హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. నిందితుడు నాగేంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారమే పదకం రచించినట్లు పోలీసులు భావిస్తున్నారు.  నిందితుడి కాల్‌డేటాను పరీశీలించిన పోలీసులు.. హత్య జరిగే కొద్దిసేపటి ముందు తన స్నేహితుడికి ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో అతన్ని కూడా విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నట్టు సమాచారం.

హత్య చేసే ముందు తనకు ఫోన్‌ చేసిన నాగేంద్ర కాసేపటిలో దివ్య తేజశ్విని ఇంటి దగ్గరకు రావాలని కోరినట్టు అతను పోలీసులకు తెలిపాడు. అయితే అతను వచ్చే సరికే రక్తపుమడుగులో ఉన్న దివ్యను ఆసుపత్రికి తరలించేందుకు కిందకు తీసుకువస్తున్నారని, లోపలికి వెళ్లి చూస్తే నాగేంద్ర కూడా రక్తపు మడుగులో ఉండడం చూశానని అతను పోలీసులకు తెలిపారు.