దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దాదాపు మూడ్నేళ్ల తర్వాత నిన్న కరోనా కేసుల సంఖ్య 50వేల లోపు నమోదయ్యాయ్. 46,790 కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది అనుకున్నారు. కానీ ఈరోజు మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 54,044 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,51,108కు చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,40,090 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 67,95,103 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజే 717 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో  కరోనాతో ఇప్పటి వరకు 1,15,914 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 9.67 శాతంగా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం రికవరీ రేటు 88.81శాతంగా ఉంది. మరణాలు రేటు 1.51 శాతానికి చేరింది.