ఢిల్లీపై పంజాబ్ ఈజీ విన్

ఐపీఎల్ లో పంజాబ్ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఐద వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీనిర్ణీత 20 ఓవర్లలో దిల్లీ 164 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ బాదాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (14), రిషభ్ పంత్‌ (14) కాసేపు అతడికి తోడుగా నిలిచారు.

ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే విజయవంతంగా ఛేదించింది. నికోలస్‌ పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6), మాక్స్‌వెల్‌ (32; 24 బంతుల్లో 3×4), క్రిస్‌గేల్‌ (29; 13 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. 56 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. ఆ తర్వాత తేరుకొని.. విజయం వైపుగా పయనించింది. 18 బంతుల్లో 14గా ఉండటం.. దీపక్‌ హుడా (15*; 22 బంతుల్లో 1×4), జేమ్స్‌ నీషమ్‌ (10*; 8 బంతుల్లో 1×6) పని పూర్తి చేశారు. ఈ విజయంతో పంజాబ్ 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది.