కంగనాని నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకి పాల్పడింది ఆకతాయిలు కాదు. ఓ లాయర్. ప్రస్తుతం కంగన తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కంగనా షేర్‌ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్స్‌ వచ్చాయి. ‘నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ వచ్చిన కామెంట్స్‌ చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు.

ఇంతలో సదరు న్యాయవాది క్లారిటీ ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసి దాని నుంచి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. నా స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని షాక్‌కి గురయ్యాను. నాకు స్త్రీలు, సమాజం పట్ల గౌరవం ఉంది. నా అకౌంట్‌ నుంచి వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’ అని పోస్ట్‌ పెట్టారు.