హైదరాబాద్ వర్షాలు.. పవన్ రూ. కోటి సాయం !

భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలకి అండగా నిలిచేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తలో రూ. కోటి సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనవంతుగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.

‘అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు. ఓ వైపు కరోనా పట్టిపీడిస్తుంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎడతెరిపి లేని వర్షాలు.. గత దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని వర్షాలని మనదేశం చూసింది. అలాగే మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో.. ప్రజల జీవిన విధానం చిన్నాభిన్నం అయిపోయింది. వారిని ఆదుకొనేందుకు గానూ తన వంతు సాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నా. అలాగే జనసైనికులు, ఇతర ప్రముఖులు తమవంతు సాయం అందించాల్సిందిగా కోరుతున్నా’నన్నారు పవన్