విజయ్ సరసన రాశీ

‘ఊహాలు గుసగుసలాడే’ చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయింది రాశీఖన్నా. ఆ తర్వాత ఎక్కువగా గ్లామర్ పాత్రలోనే కనిపించింది. అయితే ‘తొలిప్రేమ’తో తనలో అద్భుత నటి ఉందని నిరూపించుకొంది. ఇప్పుడు ఆ ప్రతిభని టాలీవుడ్, కోలీవుడ్ కూడా వాడుకుంటోంది. తాజాగా రాశీఖన్నా ‘తుగ్లక్‌ దర్బార్‌’ అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొన్నారు.

ఈ చిత్రాన్ని సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. దిల్లీ ప్రసాద్‌ దీనదయాలన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి సరసన ఆమె నటించనున్నారు. మొదట ఈ చిత్రంలో అదితీ రావ్‌ హైదరీని హీరోయిన్‌గా ఎంపిక చేసుకొన్నారు. డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోవడంతో ఆమె తప్పుకొన్నారు. ఆమె స్థానంలో రాశీఖన్నాని తీసుకున్నారు.  ‘తుగ్లక్‌ దర్బార్‌’
పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.