స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన స్టార్ కపుల్స్


స్టార్ కపుల్స్ నాగ చైతన్య-సమంత ఎక్కువగా సినీ వేదికపై కనిపిస్తుంటారు. ఇటీవల కాలంలో వీరిద్దరు కలిసి యాడ్స్ చేయడం కూడా మొదలెట్టారు. ఇప్పుడు కలిసి ప్రారంభోత్సవాలకి కూడా వెళ్తున్నారు. తాజాగా క్యూ త్రీ వెంచర్స్‌కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని సామ్-చై కలిసి లాంచ్ చేశారు.

32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు వివిధ సైజులలో ఉన్న ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని స్టార్ కపుల్స్ లాంచ్ చేయడమే కాదు… ప్రమోట్ కూడా చేశారు. చైతూ స్వయంగా కంపెనీ టీవీ మోడల్స్ గురించి వివరించారు. వాయిస్ రిమోట్ ఆప్షన్‌తో రాబోతున్న ఈ టీవీ భారత మార్కెట్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో చైతూ నటించనున్నారు. ఇందులో చైతూకి జంటగా సామ్ నటిస్తారనే ప్రచారం ఉంది. ఇక సామ్ ప్రస్తుతం ‘ద ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. త్రివిక్రమ్-తారక్ సినిమా కోసం సామ్ ని తీసుకొన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.