హైదరాబాద్ వర్షాలు సంపూ రూ.50వేల సాయం

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబుది గొప్ప మనసు. సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. గతంలో పలుమార్లు వరద బాధితులకి సాయం చేశారు. ఏపీ, కర్ణాటక వరధ బాధితులకి ఆయన సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సొంత రాష్ట్రం తెలంగాణలో భారీ వర్షాలు-వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. సంపూ సాయం చేయకుండా ఎలా ఉంటారు?

తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సంపూ తన వంతుగా రూ.50వేల విరాళం అందించారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుని కలిసి చెక్ ని అందించారు. సంపూది పెద్ద చేయినే. కర్నాటకలో వరదలు వచ్చిన సమయంలో రూ.2లక్షల విరాళం ఇచ్చారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో పని లేక గత ఆర్నేళ్లుగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈసారి రూ.50వేల సాయం చేశారు.