హైదరాబాద్ వర్షాలు.. రామ్ రూ.25లక్షల సాయం !

భారీ వర్షాలు-వరదలతో హైదరాబాద్ నగరం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగర ప్రజలని ఆదుకోవడానికి వ్యాపార, సినీ ప్రముఖులు ముందుకు రావాలి. సాయం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయ్.

ఇప్పటికే చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, విజయ్ దేవరకొండ, సంపూర్నేష్ బాబు తదితరులు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో రామ్ తనవంతుగా రూ. 25లక్షల విరాళం అందించారు. హైదరాబాద్ లోని మంత్రి కేటీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన రామ్..రూ.25 లక్షల చెక్ ను కేటీఆర్ కు అందజేశారు. ఇక రామ్ నటించిన రెడ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.