ఐపీఎల్ నుంచి ధోని అవుట్ !?

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు మహేంద్ర సింగ్ ధోని. ధోని సడెన్ సప్రైజ్ అభిమానులకి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా ధోని తప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా ఐపీఎల్ లో ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు అద్వానంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్ ఆశలని చెన్నై ఎప్పుడో వదులుకుంది.

మరోవైపు ఇదే తన చివరి ఐపీఎల్ అన్నట్టుగా ధోని సంకేతాలిస్తున్నారు. ధోని తన నెం.7 జెర్సీని దానం చేస్తున్నాడు. రాజస్థాన్ తో మ్యాచ్ అనంతరం ఆ జట్టు ఆటగాడు బట్లర్ కు ధోని జెర్సీ ఇచ్చారు. ముంబై మ్యాచ్ అనంతరం హార్తిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు ధోని జెర్సీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఇక ఈ ప్రచారంపై ధోని ఎప్పటిలాగే కామ్ గా ఉన్నారు.