‘మిస్ ఇండియా’ ట్రైలర్.. అదిరింది !

‘మహానటి’తో కీర్తి సురేష్ కీర్తి మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు. అంతకుమించి. అందుకే సోలో గా ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతని ఇస్తోంది. ఈ క్రమంలో ఆమె నుంచి వచ్చిన ‘పెంగ్విన్’ ఓటీటీలో రిలీజ్ అయింది. పర్వాలేదనిపించింది. కీర్తి తాజా చిత్రం ‘మిస్ ఇండియా’.

నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మహేష్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర,రాజేంద్ర ప్రసాద్‌, నదియా, కమల్ కామరాజు, నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. చిన్నప్పటి నుంచే బిజినెస్ చేయాలనే కోరికతో కీర్తి సురేశ్ పెరుగుతోంది. అందుకోసం ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ ?? అనే కథాంశంతో మిస్ ఇండియా తెరకెక్కిందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది.