కీర్తి సురేష్.. మెగా మూల్యం చెల్లించుకోక తప్పదు !

మహానటి కీర్తి సురేష్ పై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆమె మెగాస్టార్ సినిమాకి ఓకే చెప్పడమే. చిరంజీవి హీరోగా రాబోతున్న వేదాళం రీమేక్ లో కీర్తిసురేష్ నటించడానికి ఒప్పుకుంది. అందులో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించబోతోంది. ఇది ఆమె అభిమానులకి మాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే ? ఓ లాజిక్ చెబుతున్నారు. 

అదేంటీ అంటే.. ?  చిరంజీవి సినిమాలో అతడికి చెల్లెలిగా నటించడమంటే, ఇక మెగా కాంపౌండ్ హీరోలందరికీ కీర్తిసురేష్ దూరమైనట్టే. భవిష్యత్తులో బన్నీ, చరణ్, పవన్ కల్యాణ్ లాంటి మెగా హీరోలు ఆమెను కన్సిడర్ చేయకపోవచ్చు. కీర్తి సురేష్ ఫ్యాన్స్ లాజిక్ కూడా కరెక్ట్ నే. ఇదీగాక.. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో ఈ చెల్లెలి పాత్రలు అవసరమా అనేది వాళ్ల ప్రశ్న. మరీ.. ఫ్యాన్స్ టాక్ ని లెక్కలోనికి తీసుకొని కీర్తి యూటర్న్ తీసుకుంటుందేమో చూడాలి.