లోకేష్’కి ఆ రెండింటికి తేడా తెలియదు !

మంత్రి కొడాలి నాని మీడియా ముందుకొచ్చారంటే.. సంచలనే. ఆ రేంజ్ లో ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తారయన. మరీ.. ముఖ్యంగా తెదేపా యువ నేత నారా లోకేష్ అంటే పండగ చేసుకుంటారు. ఆయనపై సంచలన కామెంట్స్ చేస్తుంటారు. సటైర్స్ వేస్తున్నారు. తాజాగా కొడాలి నాని మీడియా ముందుకొచ్చారు. నారా లోకేష్‌కు వరి చేనుకి.. చేపల చెరువుకి తేడా తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. అతనో వేస్ట్ ఫెలో అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమాని కూడా నాని టార్గెట్ చేశారు. రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ.. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ.. తనను తాను గన్‌తో కాల్చుకోవాలి అంటూ కామెంట్ చేశారు. అసలు పోలవరం ఇబ్బందులకు దేవినేని ఉమానే కారణని అంటూ ఆరోపించారు.