‘సర్కారి వారి పాట’ మొదలైంది

సూపర్ స్టార్ మహేష్ బాబు సప్రైజ్ చేశారు. సడెన్ గా సెట్స్ కి వచ్చేశారు. ఆయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇప్పట్లో ఉండదు. డిసెంబర్ లేదా జనవరిలో సెట్స్ కి వచ్చేందుకు మహేష్ ఓకే చెప్పారు అనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది.

సెట్స్ లో తీసిన పిక్ ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టా గ్రాములో షేర్ చేశారు. ‘లైట్స్‌, కెమెరా, యాక్షన్ ఈ మూడు పదాలు సినిమా స్టార్స్‌కి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి’ అని కామెంట్ పెట్టారు. మరోవైపు సంగీత దర్శకుడు థమన్ కూడా సర్కారి వారి పాట అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా సాంగ్ ని పూర్తి చేశామని ట్విట్ చేశారు. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.