కొడంగల్’లో తఢాఖా చూపించా.. ఇది నా గడ్డ.. !

దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస గెలుపు బాధ్యతని మంత్రి హరీష్ రావు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెరాస అభ్యర్థి సోలిపేత సుజాత గెలుపు బాధ్యతని హరీష్ అన్నీ తానై చూసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా మారారు. వారిపై మాటల దాడి చేస్తున్నారు. శనివారం ప్రచారంలోనూ హరీష్ రావు మాటల వాడివేడి కనిపించింది.

దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘పరాయి నాయకులు.. కిరాయి మనుషులే బీజేపీకి దిక్కు. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ. వాళ్లు సీసాలు, పైసలు, అబద్దాలను నమ్ముకున్నారు. ఎక్కడెక్కడి లీడర్లు వచ్చి దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలయ్యాక వారెవరైనా ఇక్కడ ఉంటారా?. రేవంత్‌రెడ్డిని కొడంగల్‌కు పోయి ఓడించా. ఇది నా గడ్డ.. వాళ్లు వచ్చి ఏం చేస్తారు’ అని హరీష్ అన్నారు.