కరోనా నుంచి దేశం కోలుకుంటోంది !

కరోనా నుంచి క్రమ క్రమంగా దేశం కోలుకుంటోంది. రికవరీ రేటు పెరుగుతోంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ తగ్గుతూ 6లక్షల దిగువకు చేరింది. ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5,82,649కి చేరగా.. ఈ రేటు 7.16శాతానికి తగ్గింది. ఇక రికవరీ రేటు 91.34శాతానికి పెరిగింది.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 48,268 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో  దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81,37,119కి చేరింది. గత 24 గంటల్లో 59,454 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 74,32,829కి పెరిగింది. మరోవైపు వైరస్ కారణంగా మరో 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 1,21,641కి పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.49శాతంగా ఉంది.