ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు చిత్తు

ముంబై చేతిలో ఢిల్లీ ఘోరంగా ఓడింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్ (25; 29 బంతుల్లో, 1×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఆ జట్టును బుమ్రా (3/17), బౌల్ట్‌ (3/21) దెబ్బతీశారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబయి 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇషాన్‌ కిషాన్‌ (72*; 47 బంతుల్లో, 8×4, 3×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు ఇషాన్‌, డికాక్‌ (26; 28 బంతుల్లో, 2×4) ఢిల్లీకి అవకాశం ఇవ్వలేదు.