దుబ్బాక ఉప ఎన్నిక : తెరాస నేతల ఇళ్లలో సోదాలు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ఇవాళ, రేపు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలంతా దుబ్బాకలోనే తిష్ట వేశారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా తెరాస నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

దుబ్బాక జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సహా ఏకకాలంలో ఎనిమిది మంది నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో నగదు ఎమీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఉప ఎన్నిక కోసం భారీగా నగదు ప్రవాహం కొనసాగుతోందన్న సమాచారంతో వివిధ పార్టీల నాయకులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో బాగంగా ఇవాళ తెరాస నాయకుల ఇళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్ బంధువు ఇంటిలో డబ్బుపట్టుబడిన సంగతి తెలిసిందే.