కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం రైతు రాజ్యం అనిపించుకుంటోంది. రైతుల కోసం పలు సంక్షేమ పథకాలని అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలని తీసుకొస్తోంది. రైతుబంధు, రైతు భీమా అమలు చేస్తోంది. మిషన్ భగీరధ ద్వారా చెరువులని నింపితోంది.

మరోవైపు 24 గంటల నాణ్యమైన కరెంట్ ని అందిస్తుంది. పెట్టుబడి సాయంగా రైతుబంధు అమలు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మరో కార్యక్రమం రైతు వేదికలు.

జనగామ జిల్లా కొడకండ్లలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాన్ని శనివారం తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.